L2: మాలీవుడ్ ను షేక్ చేసిన ఎంపురన్..భారీ ఓపెనింగ్స్.. 4 d ago

మోహన్ లాల్ , పృథ్వీరాజ్ సుకుమారన్ రిపీట్ కాంబో.. 'ఎల్2 ఎంపురాన్ ' భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్గా అభిమానులను ఆనందపరిచింది. మలయాళం ఇండస్ట్రీలోనే అతిపెద్ద ఓపెనర్గా నిలిచింది. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా మొదటిరోజు దేశవ్యాప్తంగా రూ.22 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. ఇప్పటివరకూ మలయాళంలో ఏ సినిమాకి ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని నిపుణులు అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సినిమా రూ.80 కోట్లు వసూళ్లు అయింది. ఈ వారంతంలో భారీ వసూళ్లు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.